ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలి

సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్
రామన్నపేట నవంబర్ 19 (జనంసాక్షి)
ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా స్కూల్ పిల్లలతో  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మలవిసర్జన ఆరు బయట చేయరాదని, అది అనారోగ్యానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో   పంచాయతీ కార్యదర్శి ఖదీర్  హైస్కూలు ఉపాధ్యాయులు, ఏఎన్ఎం మంజుల ఆశ కార్యకర్తలు ,అంగన్వాడి టీచర్లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.