ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ప్రకటించాలని రాస్తారోకో

మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ప్రకటించాలని దళిత మహిళలు మండల కేంద్రమైన  గరిడేపల్లి లో హుజూర్నగర్ మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన కొంతమంది దళిత మహిళలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఒక్కరిద్దరూ దళితులకు ఇచ్చి మిగిలిన దళితులందరినీ నిరాశకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని దళితులందరికీ దళిత బంధు పథకాన్ని మంజూరు చేసి కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని కట్టుబడి ఉండాలన్నారు. రోడ్లకు ఇరువైపులా  వాహనాలు ఆగి ట్రాఫిక్ అంతరాయం కలవడంతో వెంటనే ఎస్సై కొండల్ రెడ్డి  దళిత మహిళలకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.