ప్రధాని సభను అడ్డుకుంటారనే నెపంతో అరెస్టులు.

బెల్లంపల్లి, నవంబర్ 12, (జనంసాక్షి )
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం సభను అడ్డుకుంటామని వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే బెల్లంపల్లి పోలీసులు ఆయా పార్టీల నాయకులను, కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీధర్, టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణి రాం సింగ్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, మాల మహానాడు మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు కుంబాల రాజేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల గోపి, ఆడెపు రాజమౌళి, పోతుల లింగయ్య, నామని శంకర్, ఎంఆర్పిఎస్ నాయకులు మంతెన కొమురయ్య, రత్నం ఐలయ్య, రత్నం రాజం, తదితరులు ఉన్నారు.