*ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది*

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి*
*అధికారులకు రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి సూచనలు*
*పలు గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించిన ఎంపీపీ*
(జనం సాక్షి): వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి అన్నారు. రేపాక, రంగయ్య పల్లి, రేగొండ, రామన్న గూడెం తది తర గ్రామాల్లో పర్యటించారు. అయాయ గ్రామాల్లో వర్షానికి గురైన బాధితులను పరామర్శించి వారికి పునరావాసం కలిపించరు. వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవాలి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి మండల పరిషత్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూ