ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఝరాసంగం ఆగస్టు 12 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం, ఆస్పత్రి వైద్యాధికారి మజీద్, సిబ్బంది అధ్వర్యంలో మండలంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న విలేకర్ల కు రాఖీ లు కట్టి రక్షాబంధన్ శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆస్పత్రి సిబ్బందికి ఎంతో సహాయ సహకారాలు అందించారు అని గుర్తు చేశారు. ఇలాంటి ఆన్న చెల్లెలా బంధం ఇలాగే కొనసాగాలని ఆశించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తారాసింగ్ వైద్యులు గోపి, హారీప్,మధు, సి ఎచ్ ఓ సుదర్శన్ సూపర్ వైజర్ మారుత, సంతోషమ్మ పత్రిక విలేకర్లు సుధాకర్, సంగన్న, రాయికోటి నర్సింలు, మహేష్, చిరంజీవి,పెద్ద గొల్ల నారాయణ, వెంకట్, మక్తబాయ్ చందు, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.