ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారం లో భాగంగా పూల మొక్కలు నాటే కార్యక్రమం

కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి / శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సమ్మెట సత్యనారాయణ సూచన మేరకు హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ పి ఓ క్రిష్ణ ప్రసాద్ సమక్షంలో దాదాపు 100 పూల మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటగిరి, రమేష్ బాబు,సంతోష్,కొమ్మాలు,వీరన్న,ప్రసాద్,బాలక్రిష్ణ, జ్యోతి, రాజు,రాజశేఖర్, మధు,అధ్యాపకేతర బృందం నరేష్,వాహబ్,తాజుద్దీన్, వేణు,ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు.