ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

మల్దకల్ సెప్టెంబర్ 5 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్ రమేష్ లింగం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రామాంజనేయులు గౌడు, భాగ్యలక్ష్మి, నరసింహులు గోవర్ధన్ శెట్టి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.