ప్రముఖ పాత్రికేయుడి కూతురు అకాల మరణం

జుక్కల్ ,సెప్టెంబర్18,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గాంవ్ గ్రామ నివాసి ,మాజి ఎంపిటిసి, ప్రముఖ పాత్రికేయులు,ఉగ్రరూపం వార్త పత్రిక ఎడిటర్ తానాజీ పాటిల్ కూతురు డాక్టర్ సాయిప్రియ అనారోగ్యంతో హెద్రాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతు శనివారం రాత్రి అకాల మరణం పొందారు.ఆదివారం ఆమె స్వగ్రామం నాగల్ గాంవ్ లో అంత్యక్రియలు జరిగాయి. ఆమె హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మాకాలిజిస్ట్ గా పనిచేశారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం పొందడం తో నాగల్ గాంవ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె అంత్యక్రియల్లో బంధువులు,మిత్రులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శోక తప్త హృదయాలతో వీడ్కోలు పలికారు.