ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్

రంగారెడ్డి: ప్రయాణికులను పూర్తిగా ఎక్కిచ్చుకోకుండానే ఇండిగోకు చెందిన విమానం బయల్దేరి వెళ్లింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వయా బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులు ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుంది. బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న 15 మంది ప్రయాణికులు వెళ్లకుండానే గేట్ క్లోజ్ చేశారు. దీంతో సిబ్బంది తీరును నిరసిస్తూ శబరిమల వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు.