*ప్రాణం తీసిన చేపల వేట *చింతల కుంటలో పడి ఒకరు మృతి!

లింగంపేట్ 12 (జనంసాక్షి)
లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన ముద్ర కోల సిద్దు 40 అనే వ్యక్తి బుదువారం చేపల వేటకు వెళ్లి చింతల కుంటలో పడి మృతి చెందాడని లింగంపేట్ ఎస్ఐ శంకర్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మండల కేంద్రంలోని చింతల కుంటలో చేపలు పట్టడానికి వెళ్లిన సిద్దు చేపలు పట్టే గాలం నీటిలో పొదకు తట్టుకోగ అది తీయడానికి వెళ్ళిన సిద్దుకు అదే సమయంలో ఫిట్స్ వచ్చి నీటిలో పడి మృతి చెందాడని ఆయన తెలిపారు.మృతుని భార్య శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.మృతుడికి కూతురు సహస్ర (06) కుమారుడు శిరీష్ (05) ఉన్నారు.
Attachments area