ప్రియుడు మోజులో దారుణం.. భర్తను కిరాతకంగా హత్య చేయించిన భార్య

– అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన ఓ వివాహిత అడ్డు – – -తొలగించుకునేందుకు ప్రియునితో హత్య చేయించింది.

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 జనంసాక్షి;
కామారెడ్డి జిల్లా లొ ఘోరం జరిగింది.
కట్డుకున్న భర్తనె ప్రియుడి మోజులొ భర్తను కడతెర్చిన బార్య,
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన ఓ వివాహిత అడ్డు తొలగించుకునేందుకు ప్రియునితో హత్య చేయించింది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అక్రమ సంబంధం కథ గుట్టు రట్టయింది. వివరాల్లోకెళితే.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎండీ షబ్బీర్, నసీమా భార్యభర్తలు. అయితే, నసీమా సదాశివనగర్ మండలం జనగామ గ్రామానికి చెందిన ఒడ్డె హన్మంతు అలియాస్ రాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరి అక్రమ సంబంధానికి నసీమా భర్త షబ్బీర్ అడ్డుగా ఉన్నాడని.. అతడిని హత్య చేసేందుకు ఇద్దరు కలిసి పథకం రచించారు.ఈ ప్లాన్‌లో భాగంగా రాజు ఈ నెల 20వ తేదీన పని ఉందంటూ షబ్బీర్‌ను బైకుపై తాడ్వాయి మండలం కన్కల్ శివారులోని ఉప్పరికాయల గడ్డ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ షబ్బీర్‌కు ఫుల్‌గా మద్యం తాగిపించి.. మత్తులో ఉన్న అతడిపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుంతలో పాతిపెట్టి పెట్టి కామారెడ్డికి వచ్చాడు. కాగా, ఈ నెల 20 న ఇంటినుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య నసీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్రమ సంబంధం కోణంలో దర్యాప్తు చేపట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.