ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన నల్ల భారతి…

 అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి
ఫోటో రైటప్: ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కలిసిన అంగన్వాడి నాయకులు..
వరంగల్ బ్యూరో: జూలై   (జనం సాక్షి)
 తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మేడే రాజీవ్ సాగర్ ను హైదరాబాదులోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నల్ల భారతి అందించినారు.   ఈ కార్యక్రమంలో
  అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాసకవి నిర్మల, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జంగం రాణి, వరంగల్ జిల్లా కన్వీనర్  నసీమ, హనుమకొండ జిల్లా నాయకులు ఉమాదేవి, శోభారాణి,జ్యోత్స్న, సంపూర్ణ, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా నాయకులు పారిజాతం, అరుణ,నాగశౌర్య,భూపాలపల్లి జిల్లా నాయకురాలు నాగరాణి , మమత,సుజాత, మాధవి, రజిత అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు.