ఫూలాజీ బాబా చూపిన మార్గాన్ని అనుసరించాలి: – టీపిసిసి సభ్యులు కాంగ్రెస్ నేత వేడ్మ భోజ్జు పటేల్…

జనం సాక్షి 7 డిసెంబర్ ఇంద్రవెల్లి

ఇంద్రవెల్లి : సద్గురు ఫూలాజీ బాబా చూపిన మార్గంలో నడవాలని టీపిసిసి సభ్యులు ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వేడ్మ భోజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని ఆంజీ గ్రామంలో ఫూలాజీ బాబా ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనంతంలో విశ్వం ఉంది విశ్వం మనలో దాగి ఉందని చెప్పిన మహనీయుడు ఫూలాజీ బాబా అని అన్నారు. జీవితాన్ని ఉన్నతంగా జీవించడానికి, మనిషి చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ఫూలాజీ బాబా చేసిన కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోమారే నగొరావు, ముకాడె ఉత్తమ్,ఆత్రం రాహుల్ సర్పంచ్,దూట రాజేశ్వర్, ఆజయ్,నగేష్ తదితరులు ఉన్నారు.