ఫోటో గ్రాఫర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఫణీంద్ర కుమార్ (పెద్దొడు)ను శాలువాతో  సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్,వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్,ఎంపీపీ మోహీద్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, డిఅర్ బిఎస్ డైరెక్టర్ కోక్కుల ప్రదీప్, తెరాస మండల అధ్యక్షుడు రాజ్ గంగన్న నాయకులు పాల్గొన్నారు