బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన తహశీల్దార్ శ్రీనివాస్

మహదేవపూర్ సెప్టెంబర్ 27 ( జనంసాక్షి )

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ పండుగ చీరె ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ఆహార భద్రత కార్డు కలిగిన మహిళలందరికీ బతుకమ్మ చీరెలను అందజేయనున్నట్లు,9656 మందికి మండలంలో రేషన్ షాప్ ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తహసీల్ధార్ శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు,ఎంపీపీ రాణి బాయి,జడ్పీటీసీ గుడాల అరుణ,ఎంపీడీఓ శంకర్ నాయక్,ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్,వార్డ్ సభ్యులు,రేషన్ డీలర్లు,మహిళలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు