*బన్నప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ.*

పెద్దేముల్ ఆగస్టు 19 (జనం సాక్షి)
 పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు గ్రామంలో బుధవారం నాడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాంబూర్ బన్నప్ప అకాల మరణం చెందాడు.అట్టి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శుక్రవారం నాడు ఇందూరు గ్రామానికి వెళ్లి బన్నప్ప కుటుంబాన్ని పరామర్శించారు.అదే గ్రామం లోని జేట్టిగారి రామప్ప మరణించడంతో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.ఆయన వెంట సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, పెద్దేముల్ ఎఫ్ఏసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఇందూర్ ప్రకాష్, ఇందూర్ మొగులప్ప, పట్లోళ్ల బాల్ రెడ్డి,పట్లోళ్ల నర్సింలు, బోయరాజు తదితరులు పాల్గొన్నారు.