బస్సు టైర్లలో గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు….

మహబూబ్ నగర్: ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. గద్వాల్ బస్టాండు నుంచి రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు, పోలీసులు ఎస్కార్ట్ తో బైటకు పంపారు. ఆ రెండు బస్సులు గద్వాల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోనుపాడు గ్రామం వద్దకు చేరగానే ఆర్టీసీ కార్మికులు రెండు బస్సుల టైర్లలో గాలి తీసేసి నిలిపేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.