బహిరంగ సభకు బయలుదేరిన మండల బిజెపి శ్రేణులు

కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి /బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు వరంగల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు పొదిలి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ జెండా ఊపి ప్రారంభించగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు వల్లభు వెంకటేశ్వర్లు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.