బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ లింగాల ఘణపురం, జూన్10(జనం సాక్షి):

బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ కార్యక్రమం  నెల్లుట్ల గ్రామంలో నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం నెల్లుట్ల గ్రామంలో పది మంది రైతులకు ఉచితంగా గో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం మహేష్ మాట్లాడుతూ గోవులను
పెంచడం ద్వారా వాటి నుండి వచ్చే పేడ, మూత్రం ద్వారా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించి నట్లయితే అధిక దిగుబడి చేకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మరియు నల్గొండ  గోశాల అధ్యక్షుడు గౌరీ నాయుడు పాల్గొని  మాట్లాడుతూ గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప భూపాల్ రెడ్డి, గొరిగే రాజు, మధు, శ్రీకాంత్, మరియు గోశాల ప్రతినిధులు నిర్వాహకులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.