బాంబు పేలుడు ఘటనలో మృతుని కుటుంబానికి చెక్కు అందజేత

జడ్చర్ల: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన జడ్చర్లకు చెందిన హరీష్‌కార్తీక్‌ కుటుంబానికి జిల్లా కలెక్టరు గిరిజా శంకర్‌, జేసీ శర్మన్‌ శుక్రవారం రూ.6లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మృతుని సోదరుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.