బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ పార్టీ..

సర్పంచ్ పాతర్ల సుదర్శన్.
ఊరుకొండ, సెప్టెంబర్ 14(జనం సాక్షి):
బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని సర్పంచ్ పాతర్ల సుదర్శన్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు గోరెంక మల్లయ్య(40) మరణించడం జరిగింది. ఈ విషయం స్థానిక సర్పంచ్ సుదర్శన్ గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి దృష్టికి మరియు జనార్దన్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ చేర్లకొల లక్ష్మారెడ్డి గారు మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ సహాయంగా రూ.5000, కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రూ. 5000/-, మరియు స్థానిక సర్పంచ్ సుదర్శన్ 5000/- మొత్తం 15,000/- రూపాయలు సర్పంచ్ సుదర్శన్ గారి చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. సుదర్శన్ మాట్లాడుతూ ఎవరికి ఆపద వచ్చినా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు చిరంజీవి, మరియు గ్రామ పెద్దలు నారాయణ, లాలు, వెంకటయ్య, నరసింహ, పరంధాములు, యాదయ్య, కృష్ణయ్య, శ్రీశైలం, శివ, యాదయ్య, వెంకటేష్, తదితరులు ఉన్నారు.