బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్ పోచారం.

నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త దొంతి శంకర్ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఆయన వెంట రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటిసి, కో ఆప్షన్ మజీద్,వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలక్రిష్ణ, తెరాస నాయకులు కంది మల్లేష్, లక్ష్మీ నారాయణ గౌడ్,సాయగౌడ్,ఇమ్రాన్,నర్సింలు గౌడ్,మైసగౌడ్ తదితరులు ఉన్నారు.