బాధిత కుటుంబాలకు అప్పన్న హస్తం

అండగా నిలుస్తున్న జడ్పిటిసి
శివ్వంపేట సెప్టెంబర్ 19 జనంసాక్షి : మండలంలో ఎవరికి ఏ ఆపద ఆ బాధితు కుటుంబాల పక్షాన అండగా నిలుస్తూ, వారిలో మనోస్థైర్యం కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలో ఎవరికి ఏమైనా కానీ చిన్నపాటి ఆపద వచ్చిన జిల్లా ఆర్థిక ప్రవళిక సంఘం సభ్యులు స్థానిక జడ్పిటిసి అబ్బ మహేష్ గుప్తా అండగా నిలుస్తున్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మానంగారి అర్జున్  కరెంటు షాక్ కు గురై చరిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా సోమవారం హాస్పిటల్ కీ వెళ్లి బాధితుని పరామర్శించి, 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంధ్య వెంకట్ స్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని చిన్నగొట్టి ముక్ల గ్రామానికి చెందిన యువకుడు గుమ్మడి వినోద్ అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి, అలాగే నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుద్దేటి బాలమణి నరేందర్, ఎంపీటీసీ నువ్వుల దశరథ, యువ నాయకులు నవీన్, గ్రామ కమిటీ అధ్యక్షులు నాసిర్, పట్నం శీను, నాయకులు గుమ్మడి ఎల్లం, ఎత్తేశం, సలీం బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area