*బాధిత కుటుంబాలను పరామర్శించిన జెడ్పిటిసి.

 చిట్యాల ( జనం సాక్షి) వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను జడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి సోమవారం పరామర్శించి తమ సంతాపం తెలిపారు. మండల కేంద్రంలోని మోతే  సంపత్  మృతదేహానికి నివాళులర్పించారు.అనంతరం చల్లగరిగ గ్రామంలో ఇటీవల మరణించిన గంటే ఐలయ్య , మహ్మద్ ఖాజా కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారితో చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ , మండల యూత్ అధ్యక్షులు తౌటం నవీన్, ప్రధాన కార్యదర్శిలు మేరుగు సంపత్, ఏరుకొండ రాజేందర్, మండల నాయకులు దామెర రాజు, ఐలయ్య తదితరులున్నారు.
Attachments area