బారి వర్షంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పట్టణ కేంద్రం లో పర్యటన

 ఇళ్లు కూలిన బాధితులకు  తక్షణ సాయం. అందించాలని ఆర్ డి ఓ కు  పురామయించిన  ఎమ్మెల్యే
13  జులై  ( జనంసాక్షి ) బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన  ద్రోణి  తో  గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య  ఎల్లారెడ్డి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు పట్టణంలో 12వ వార్డు 6 వార్డు  తో  పాటు  పలు వార్డులు లలో భారీ వర్షాల కారణంగా  శిథిలావస్థ లో ఉన్న గృహాలు కూలిపోవడంతో గృహాలు సందర్శించి బాధితలను ఓదార్చారు ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని ఎవరు కూడా దిగులు పడద్దని వారికి ఎమ్మెల్యే భరోసా కల్పించారు పూర్తిగా కూలిపోయిన గృహాల వారికి. వెంటనే  తాత్కాలికంగా   ఏర్పాటు చేసిన గృహాల్లోకి మార్చాలని  స్థానిక ఆర్డీవో శ్రీనివాస్ కి ఆదేశాలు జారీ చేశారు  మరో రెండు రోజులు వర్షాలు ఉన్న దృశ్య ఎవరు కూడా బయట తిరగవద్దని  ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని  ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్  సత్యనారాయణ ఎల్లారెడ్డి తహసీల్దార్  మునిరోద్దీన్  ఎల్లారెడ్డి  డిటి స్వామి. ఆర్ ఐ  శ్రీనివాస్  మున్సిపల్ కమిషనర్ జీవన్ కుమార్ కౌన్సిలర్స్ నీలకంఠం. రాము. అల్లం శీను. ఎరుకల సాయిలు. ఎల్లారెడ్డి  అధికార ప్రతినిధి రామప్ప. నాయకులు. శ్రవణ్ కుమార్  మనోజ్. అరవింద్ గౌడ్. పోచయ్య . తదితరులు పాల్గొన్నారు