బాలవికాస సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం.

దౌల్తాబాద్, ఆగస్టు 13, జనం సాక్షి.
మండల పరిధిలో దీపాయంపల్లి గ్రామంలో బాలవికాస ఏటీడబ్లు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.కాకర్ల శేషరత్నం గారి జ్ఞాపకార్థంగా బాలవికాస స్వచ్చంద సంస్థ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. బాలవికాస వాటర్ ప్లాంట్ ప్రోగ్రాం సీనియర్ మేనేజర్ కందుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఫ్లోరైడ్ రహిత నీటిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తేవడమే బాలవికాస ఉద్దేశ్యమని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల చదువు కోసం బాలవికాస అండగా ఉంటుందని, గ్రామంలో ఎవరైనా అలాంటి వారు ఉంటే వివరాలు అందజేయాలని వారికి అన్నిరకాల సహాయం అందజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి,మాజీ సర్పంచ్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఫీల్డ్ కోఆర్డినేటర్ సంపత్,మొబైల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గొల్ల దుర్గవ్వ, వార్డ్ మెంబర్లు నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు భూం రెడ్డి, దుర్గేష్,గ్రామ యువకులు ,శ్రీశైలం, ప్రభాకర్,మహేష్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.