బాలికను కిడ్నాపు చేసిన వ్యక్తిపై కేసు

కేసముద్రం,(జనంసాక్షి):మాయమాటలతో నమ్మించి 15 సంవత్సరాల బాలికను తీసుకువెళ్లిన వ్యక్తిపై కిడ్నాపు కేసు నమోదు చేసినట్లు కేసముద్రం పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు చేప్పారు. మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన కొళ్లపుట్టి వెంకన్న అనే యువకుడు బడితండాకు చెందిన బాలికను మాయమాటనతో నమ్మించి ఈ నెల 14న తీసుకువెల్లాడు. బాలిక ఆచూకీ కోసం వెదుకుతున్న క్రమంలో వెంకన్న తీసుకువెళ్లినట్లు వెల్లడికావటంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేసినట్లు పోలీసులు వివరించారు.