బావిలో దూకి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి : వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.