బిచ్కుందలో వీఆర్ఏ ల మానవహారం

బిచ్కుంద ఆగస్టు 10 (జనంసాక్షి) విఅర్ఓ, విఆర్ఏల సమ్మె గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి మానవహారం నిర్వహించారు. విఅర్ఏ లకు పే స్కేల్ తో పాటు ప్రమోషన్లు ఇవ్వాలని, ఇవి మేము కొత్తగా చేసిన డిమాండ్లలు కావని సీఎం కెసిఆర్ అసెంబ్లీ, జనంసాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అన్నారు. విఅర్ఓ, విఆర్ఏ ల సమస్యలను పటించుకొకపోతే ఈ ఉద్య మాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, మేము కూడా ఓటర్లమే అని, ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్, మండల అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు అనిల్, సాయిలు, రాజు, మంజూల, సునీత, హన్మండ్లు మరియు మండల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.