బిజెపికి మరోసారి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన శ్రీగాదా మైసయ్య.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 21. (జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీగాద మైసయ్య పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లా నియోజకవర్గం నుండి స్థానికంగా 22 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించకుండా రాణి రుద్రమరెడ్డినిపార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కు టికెట్ ఇస్తారని ఆశించామని అన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాధాన్యక ఇవ్వక పోవడాన్ని తప్పు పట్టారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ లేఖను జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు పంపనున్నట్లు తెలిపారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న లగిశెట్టి శ్రీనివాస్ కు మద్దతుగా నిలబడతామని అన్నారు. కార్యక్రమంలో బాలాజీ,బచ్చు రాజు, గాజుల శ్రీనివాస్ ,ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు