బిజెపి కోవర్ట్!! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మార్చుకోవాలి…జడ్పీటీసీ మోహన్ రెడ్డి

రామారెడ్డి  సెప్టెంబర్  25   (జనంసాక్షీ)  :
 బిజెపి కోవర్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ తీరు మార్చుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని కామారెడ్డి జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్  లీడర్ ,రామారెడ్డి జడ్పీటీసీ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. షబ్బీర్ అలీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉగ్గు పాలు తాగి, రాజకీయంగా నాయకుడివై  తల్లి రొమ్మును గుద్దినట్లు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, తమ్ముని కోసం బీజేపీలో కోవర్టుగా మారవన్నారు.  గట్టుప్పల్ జడ్పిటిసిని తమ్ముడి కోసం దాదాపు రెండు కోట్లు పెట్టి ముందుండి కొన్నది నీవు కాదా?  అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిదన్నారు. సముద్రంలోకి కొత్త నీరు వస్తుంది. పాత నీరు వెళ్ళిపోతుందన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో పాత నీరు వంటి వారు అని అభివర్ణించా రు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని  పార్టీ కోసం తన జీవితాన్ని అంకితమిచ్చిన మాజీమంత్రి షబ్బీర్ అలీని విమర్శించడం మీకు తగదన్నారు. ప్రజా ప్రతినిధులను కొన్నంత మాత్రాన  ఓటు బ్యాంకును కొనలేవన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద పదవులు అనుభవిస్తువచ్చావని గుర్తం చేశారు. మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.