*బిజెపి విజయోత్సవ సంబరాలు*

కొడకండ్ల, జులై21(జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో  నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు కుంభం అశోక్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత చరిత్రాత్మకమైన రోజు ఈరోజు అని
ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిచి రాష్ట్రపతి భవన్ కి వెళ్లడం దేశం గర్వించదగ్గ విషయమని,ఈ సందర్భంగా  ద్రౌపది ముర్ము కి హృదయపూర్వక అభినందనలు తేలియజేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోటేశ్వర్, జిల్లా కార్యదర్శి సోమన్న, మండల ప్రధాన కార్యదర్శి మారిసెట్టి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు సట్టు శ్రీనివాస్, రమేష్,బయన్న, హరిబాబు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పనస రాములు,ఓబిసి మండల అధ్యక్షులు పసుపులేటి సాయి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.