బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర భుత్వాలు అలోచించిన దాఖలాలు లేవన్నారు. బీసీ ఉపకులాలకు సంబంధించిన అన్ని వృత్తుల వారిని ప్రోత్సహించడానికి గాను సీఎం కేసీఆర్‌ భారీ ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. చేనేత కార్మికుల అభివృద్ది కోసం రూ. 180 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు రూ. 37.80 కోట్లు, రజకుల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు.. ఇలా అన్ని కుల వృత్తులకు జీవం పోస్తున్నారని తెలిపారు. గతంలో బీసీ వ్యక్తిగత రుణాలకోసం యువకులు నానతంటాలు పడాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. మరో కొన్ని రోజుల్లో బీసీలకు రుణాలు మంజూరు చేయనున్నారని తెలిపారు.