బీజేపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ను సన్మానించిన తొర్రూరు నేతలు.

తొర్రూర్ 5 సెప్టెంబర్ (జనంసాక్షి )
బీజేపీ తొర్రూరు నేతలు ఇటీవలే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు గా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు గా యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడు గా ఎన్నికైన బీజేపీ ఓబీసి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోవా లక్ష్మణ్ ని ఈరోజు హైదరాబాద్లో వారి నివాసం లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ లో క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తుంది అని తెలిపారు.పార్టీ పురోభివృద్ధికి తోడ్పడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన చెప్పారు.గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినం పై బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగా నే నేడు కేసీఆర్ సర్కారు దిగివచ్చి ఎట్టకేలకు విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు అని ఇది ముమ్మాటికీ బీజేపీ విజయం అని భావిస్తున్నట్టు చెప్పారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రదాని నరేంద్ర మోడీ క్రృషి ఫలితంగా నే నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఎదిగింది అని తెలిపారు.రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లికి బీజేపీ నేతృత్వంలో విముక్తి కాబోతుంది అని, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, మానుకోట జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి, తొర్రూరు మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, రూరల్ మండలం అధ్యక్షుడు బొచ్చు సురేష్, పెదవంగర మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన సుధాకర్ మరియు ధర్మారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area