బీడీ కాలనీ లో సీసీ రోడ్ల, నిర్మాణ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ నీలకంఠం

ఎల్లారెడ్డి,అక్టోబర్13 (జనం సాక్షి ) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డులోని బీడీ కాలనీ లోమురికి కాలువలు, సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే జాజాల  సురేందర్  సహకారంతో 12 వార్డు కౌన్సిలర్ నీలకంఠం.  కొబ్బరికాయ కొట్టి  ప్రారంభిచారు.  అనంతరం కౌన్స్ లర్ నీల కంఠం  మాట్లాడుతూ  స్పెషల్ డెవలప్ మెంట్  పండ్స్ లో నుండి 13లక్షల రూపాయలతో  పనులు చేస్తున్నామని తెలిపారు  బీడీ కాలనీ లో మురికి కాల్వల నిర్మాణం ద్వారా మురికి నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ  ద్వారా అభివృద్ది చేస్తున్నామని  దోమల బెడద ఉండబొదని సి సి రోడ్లతో  బీడీ కాలనీ నీ అందంగా అభివృద్ది చేస్తామని అన్నారు  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.