బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

నల్గొండ: బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పత్తిబేళ్లు కాలిబూడిదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో నష్టం భారీగా అంచనా వేస్తున్నారు.