బీసీ కులాల జాబితా కసరత్తు పూర్తి.. జస్టిస్‌ ఈశ్వరయ్య

6

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): బీసీ కులాల జాబితాపై కసరత్తు పూర్తయినట్లు బీసీ కమిషన్‌ జాతీయ అధ్యక్షుడు జ్టసిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఇరు రాష్టాల్ల్రో వెనుకబడిన కులాల వివరాలు సేకరించామని.. వినతులు, అభ్యంతరాలు స్వీకరించినట్లు స్పష్టం చేశారు. నెలరోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రశంసనీయమని.. ఈ సర్వే దేశానికే ఆదర్శవంతమైన సర్వేగా నిలుస్తుందని జ్టసిస్‌ ఈశ్వరయ్య కొనియాడారు.