బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ కు ఎస్ పి రాహుల్ హెడ్డే ప్రశంస పత్రం అందజేత

బోయిన పల్లి సెప్టెంబర్ 15 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ వర్టికల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బోయినపల్లి ఎస్.ఐ అభిలాష్ కు గురువారం రోజున జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే ప్రశంశ పత్రం అందజేశారు. అభిలాష్ మాట్లాడుతూ జిల్లా ఎస్ పి కి అదనపు ఎస్ పి కి తనకు సహకరించిన స్టేషన్ సి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ పి చంద్రయ్య ఉన్నారు.