బ్రిడ్జి కింద మృతదేహం

నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహానికి తల చేతులు, కాళ్లు నరికి వేశారు. ఎవరో దారుణంగా హత్య చేసి బ్రిడ్జి కింద పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.