భద్రతా దళాలకు విశిష్ట సేవా పురస్కారాలు

– న్యూఢిల్లీ, జనంసాక్షి
భారత సైన్యంలో విశిష్ట సేవలందించిన అధికారులు, సైనికులకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే శుక్రవారం విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు భద్రతా దళాధికారులు, సైనికులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేశారు. దేశ రక్షణకు సైనికులందిస్తున్న సేవలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.