భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సోమవారం మధ్యాహ్నానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది.