భారతీయ కిసాన్ సంఘ్ పెద్ద కొడప్ గల్ మండల కమిటీ ఎంపిక

జుక్కల్ ,ఆగస్టు18,జనంసాక్షి,
జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు
నాగల్ గిద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం పెద్ద కొడపగల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నకోవడం జరిగింది.అధ్యక్షులుగా జి. రాజు, ఉపాధ్యక్షులుగా కుమార్ సింగ్, కార్యదర్శిగా ప్రకాష్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా జుక్కల్ అధ్యక్షులు నాగల్ గిద్దె శ్రీనివాస్ మాట్లాడుతు భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు ,కార్యవర్గం రైతు సమస్యల సాధన కు కృషి చేయాలని కోరారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా సంఘం తమ వంతు సహాకారం అందించాలని తెలిపారు. రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా ఎదిగేలా చూడాలని కోరారు. ఇప్పటివరకు బ్యాంకు రుణాలు
పొందని రైతులకు బ్యాంకు ల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల ద్వారా మోసపోయిన రైతులకు అండగా నిలబడాలన్నారు.రైతు లందరు రైతు భీమా చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బసవరాజు రెడ్డి,బాలాజీ పాటిల్, లక్సెట్టి శంకర్, హనుమారెడ్డి, క్రిష్ణా తదితరులు పాల్గొన్నారు.