భారీవర్షాలతో నగరంలో కంట్రోల్‌ రూమ ఏర్పాటు

హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరి సమన్వయంతో నగర ప్రజల సమస్యలను తీరుస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖ, టూరిజం, వాటర్‌ బోర్డ్‌, జీహెచ్‌ఎంసీ, ఎలక్టిస్రిటీ, రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది కంట్రోల్‌ రూంలో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నామంటూ కంట్రోల్‌ రూమ్‌ కు 383 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. వాటిలో 375 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించామని మేయర్‌ వివరించారు.