భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు

ప్రయాణికులందరూ సురక్షితం
వెంటనే స్పందించిన పోలీసు బృందాలు రైల్వే అధికారులు
జనం సాక్షి జూన్ 21 మోమిన్ పేట
భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ బోరబండ కు చెందిన పెళ్లి బస్సు బర్వాద్ గ్రామం కోటపల్లి మండలానికి వచ్చి పెళ్లి ముగించుకొని తిరిగి ప్రయాణంలో రాత్రి అందాలు 11 గంటల సమయంలో మోమిన్ పేట మండలం కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీళ్లల్లో బస్సు ఇరుక్కొని ముందుకు కదలు లేక అక్కడే ఇరుక్కుపోయింది అందులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటకు వచ్చారు తెల్లవారేసరికి బస్సు పూర్తిగా నీటిలో మునిగింది. ఇట్టి ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇట్టి ఘటనకు సంబంధించి వికారాబాద్ అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ రైల్వే సమాచారం అందించారు తక్షణమే నీటిని తోడిచమని మరియు భవిష్యత్తులో  ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలపడం అయినది. గతంలో  ఈ విషయం గురించి  తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జిల్లా స్థాయి అధికారులు ఆదేశించారు మోమిన్ పేట సిఐ వెంకటేశం ఆధ్వర్యంలో ఎస్ ఐ విజయ్ ప్రకాష్ ధన బృందాలతో ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు అనంతరం రైల్వే ఇంజనీర్ అధికారులు సహాయంతో బస్సును వెలికితీశారు