భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

ఐజ : మండల కేంద్రంలోని ఐజలోని దళితవాడలొ మంగళవారం అర్థరాత్రి నాగరాజు తన భార్య జయమ్మ(30) పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా గొడవలు చోటు చేసుకోవటం తో అర్థరాత్రి భార్యను చంపి ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడని విజయమ్మ ఆరోపించింది. దీని పై కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు.