“భూమి కొలతలపై అవగాహన”

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ రూరల్:కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గణిత విభాగం ఆధ్వర్యంలో భూమి కొలతలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు,కళాశాల గణిత అధ్యాపకులు ఎం.రాజేశ్వర్ విద్యార్థులకు భూమిని కొలిచే పద్ధతుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా వ్యవసాయ భూములు కొలిచే పద్దతులు మరియు నివాస భవనాల పైకప్పు కొలతలను కొలిచే విధానాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి.జనార్థన్, వి.దేవేందర్,విద్యార్థులు పాల్గొన్నారు.