మండల ప్రజలు అప్రమత్తంగా ఉ‌ండాలి:ఎంపిడిఓ ప్రకాష్ రెడ్డి

, జులై 09 (జనంసాక్షి) గత రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండడంతో జలశయాలు నిండుకొని మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని  కిందకి వదులుతున్నారు. అదేవిధంగా రానున్న రోజులలో జిల్లాలో అతి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఓ ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. కావున అన్ని గ్రామాల కార్యదర్శులు తమ గ్రామాలలోని సర్పంచి, వార్డుసభ్యులను, ఎంపిటిసిలను అప్రమత్తం చేయగలరని సూచించారు.అలాగే లోలెవల్ క్యాజువేల వద్ద ప్రవాహం ఉంటే  అటువైపు ఎవరూ వెళ్ళకుండా బారికేడ్లు అమర్చాలని కార్యదర్శులకు సూచించారు. ఏదైనా అత్యవసరం వచ్చినా ఎంపిడిఓ, తాహసిల్దార్ లేదా ఎస్సై లకు కాల్ చేసి తెలుపాలని కోరారు