మంత్రి నాగార్జునకు తృటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ,జూలై30(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వారధి నుంచి బందర్‌ రోడ్డువైపు వస్తుండగా విజయవాడలో కారు ప్రమాదానికి గురైంది. గమనించిన సిబ్బంది దగ్గరలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. శనివారం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా కారు
ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.