మంత్రి మహేందర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

రంగారెడ్డి, ఏప్రిల్‌ 02 : మంత్రి మహేందర్‌రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పడి టెంట్‌ దగ్ధమైంది. చెరువు పనులు ప్రారంభించి మంత్రి కారు దగ్గరకు వెళ్లాక అగ్ని ప్రమాదం జరగడంతో తృటిలో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.