*మద్దూరు మండల జేఏసీ కన్వీనర్ గా చిలక రమేష్*.

మద్దూరు (జనంసాక్షి) జూలై 20:  చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై,  సాగుతున్న ఉద్యమ విస్తరణలో భాగంగా మద్దూరు మండల కన్వీనర్ గా చిలక రమేష్ ను నియమిస్తున్నట్లు, జెఎసి చైర్మన్ బైరావపట్ల చక్రవర్ మరియు జేఏసీ కన్వీనర్ గద్దల మహేందర్ తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, అస్తిత్వం కొరకు ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామని, అందులో భాగంగానే కన్వీనర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత నిర్మాణం చేపడతామని ఈ ప్రాంతం కోసం జరిగే ఉద్యమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు.